తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్‌ చీఫ్‌గా సర్వశ్రేష్ట త్రిపాఠి

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్‌ చీఫ్‌గా సర్వశ్రేష్ట త్రిపాఠిఅమరావతి : తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు వున్నాయని ఏకంగా సిఎం చంద్రబాబు నాయుడే ఇటీవల ప్రకటన చేయడంతో ఈ అంశంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. టిటిడి తయారు చేసే లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీలో కల్తీపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం (సిట్‌)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌ చీఫ్‌గా గుంటూరు రేంజ్‌ ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠిని నియమించింది. అలాగే సిట్‌లో విశాఖ రేంజ్‌ డిఐజి గోపినాథ్‌జెట్టి, కడప ఎస్‌పి హర్షవర్ధన్‌తో పాటు మరికొందరు డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు సభ్యులుగా వుండనున్నారు.

Spread the love