– మే2న నోటిఫికేషన్, 27న పోలింగ్
– జూన్ 5న ఓట్ల లెక్కింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ మే 2న జారీ కానుంది. నోటిఫికేషన్ విడుదై లనాటి నుంచి మే 9 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మే10న వాటిని పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసం హరణకు చివరి తేదీ మే 13 కాగా, ఉప ఎన్నికకు అదే నెల 27నఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించ నున్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభధ్రుల నియోజక వర్గానికి ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా ఈ ఉప ఎన్నికల కోసం చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న)ను కాంగ్రెస్ తన అభ్యర్థిగా ప్రకటించింది.