మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

నవతెలంగాణ –  గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని ఇంద్ర నగర్ కు చెందిన కాలి ప్రశాంత్  తండ్రి మారుతి, వయసు (35) సంవత్సరాలు. గత కొన్ని సంవత్సరాలుగా తాగుడుకు బానిసై, వివిధ రకాల క్రిమినల్ కేసుల్లో ఉండి, సంసార విషయాలు పట్టించుకోకుండా కుటుంబానికి దూరంగా ఉంటూ వ్యక్తిగతంగా తీవ్ర మనస్థాపానికి లోనై గాంధారిలోనే ఎల్లమ్మ గుడి వద్ద చింత చెట్టుకు ఆదివారం వేకువ జామున అందాజా ఒకటి గంటలకు ఉరివేసుకుని చనిపోయాడని ఎస్.ఐ ఆంజనేయులు తెలిపారు. మృతుని భార్య హరిజన్ సవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ తెలిపారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు వైష్ణవి (14) సంవత్సరాలు,(8) సంవత్సరాలు వున్నారు.
Spread the love