చరిత్ర సృష్టించిన షెఫాలీ వ‌ర్మ..

నవతెలంగాణ – చెన్నై: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భార‌త మ‌హిళా జ‌ట్టు ఓపెన‌ర్ షెఫాలీ వ‌ర్మ విధ్వంసం సృష్టించింది. మహిళల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఆమె ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డుకెక్కింది. కేవ‌లం 194 బంతుల్లోనే 8 సిక్స‌ర్లు, 22 బౌండ‌రీలతో ద్విశ‌త‌కం న‌మోదు చేసింది. 20 ఏళ్ల షఫాలీ వర్మకు ఈ ఫార్మాట్‌లో ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. మొత్తంగా 205 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వద్ద ఆమె పెవిలియ‌న్ చేరింది.

Spread the love