శీతల పండగను జులై 11వ తేదీన యావత్ గిరిజనులందరూ జరుపుకోవాలి

Bhukya Nagu Naik

– సేవలాల్ సేన మండల అధ్యక్షుడు భూక్య నాగు నాయక్….

నవతెలంగాణ-చివ్వేంల
గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు అతి పవిత్రంగా ఉంటాయని పూజించడం ప్రేమించడం గిరిజనుల ప్రత్యేకత అని అలాగే పండుగ సందర్భాల్లో పశువులను అలంకరించడం గిరిజన జాతి పూర్వికులు నుండి ఆనవాయితీగా  వస్తుందని ప్రతి సంవత్సరం పెద్ద పూసాల కార్తీ మొదటి లేదా రెండవ మంగళవారం రోజున గిరిజన జాతి శోభ ఉండే విధంగా గిరిజనుల ఐక్యతను చాటేే విధంగా గిరిజనులు అందరూ పెద్దఎత్తున జరుపుకునే సాంప్రదాయ పండుగలలో శీతల  పండుగ అతి  పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ పండుగను రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులందరూ ఈసారి జూలై 11 న  జరుపుకోవాలని గిరిజనులు తాము జరుపుకునే పండుగలలో శీతల  పండుగ మొదటి పండుగ కావడం విశేషమని  సేవలాల్ సేన మండల అధ్యక్షులు  భూక్య నాగు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
Spread the love