న్యూయార్క్‌ సబ్‌వే స్టేషన్‌లో కాల్పులు

నవతెలంగాణ – హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో మరో కాల్పుల ఘటన నమోదయింది. న్యూయార్క్ నగరం బ్రోంక్స్‌లోని సబ్‌వే స్టేషన్‌లో ఓ దుండగుడు పలువురిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురికి బుల్లెట్ గాయాలవ్వగా ఒకరు మృత్యువాతపడ్డారని స్థానిక మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. మిగతా ఐదుగురు బాధితులకు ప్రాణాపాయంలేదని తెలిపాయి. ఈ ఘటనపై స్పందించిన న్యూయార్క్ సిటీ పోలీసులు మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. ఎంతమందిపై కాల్పులు జరిగాయనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి తెలిపారు. దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు. కాగా కాల్పులకు పాల్పడ్డ నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడా లేదా అనేది తెలియరాలేదు.

Spread the love