నవతెలంగాణ-పెద్దపల్లి టౌన్:
పెద్దపల్లి జిల్లాలోని శ్రీరామ్ ఫైనాన్స్లో ముత్యాల అశోక్ అనే వ్యక్తి తన అవసరం నిమిత్తం రూ.50 వేల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. ఇటీవలే అశోక్ అనారోగ్యంతో మృతి చెందగా, శ్రీరామ్ ఫైనాన్స్ ఆధికారులు అశోక్ తీసుకున్న రుణానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించి మృతుని తల్లికి శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో మేనేజర్ సాయి కుమార్, అశోక్ కుటుంబ సభ్యులకు బంగారు ఆభరణాలు అందజేశారు. ఇన్సూరెన్స్ రావడానికి కృషి చేసిన శ్రీరామ్ ఫైనాన్స్ అధికారులకు మృతుని తల్లి కృతజ్ఞతలు తెలిపారు.