నవతెలంగాణ- హైదరాబాద్: మాజీ మంత్రి తుమ్మల కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధమైంది. శనివారం సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరవుతున్న జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మలతోపాటు బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులు సైతం కాంగ్రెస్లో చేరతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు నిన్న కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు తుమ్మల నివాసానికి వెళ్లి చర్చించారు. కాంగ్రెస్లో చేరాలని తుమ్మలను ఆహ్వానించగా సుముఖత తెలిపారు. ఆయనకు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలో తుమ్మల గతంలో ప్రాతినిధ్యం వహించిన పాలేరు టికెట్ కోసం పొంగులేటి ఇప్పటికే దరఖాస్తు చేశారు. ఈ రెండు స్థానాల విషయంలో వీరిద్దరి మధ్య సర్దుబాటు చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది.