ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..

– సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం
నవతెలంగాణ-చివ్వేంల :
మండల  వ్యాప్తంగా కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ జన్మదిన వేడుకలను నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి  కేక్ కట్ చేశారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల  అధ్యక్షుడు వీరన్న నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన  తెలంగాణ తల్లి సోనియా గాంధీ అన్నారు. సోనియాగాంధీ  ఆయురారోగ్యాలతో ఉండాలని హస్తం పార్టీ బలోపేతం కోసం ఆ భగవంతుడు మరింత బలం చేకూర్చాలని  కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతమల్ల రమేష్, వెన్న మధుకర్ రెడ్డి, అప్పి రెడ్డి, నంద్యాల నరేష్ రెడ్డి, వేముల చిన్న, సమీర్,అనిల్,సంజీవ,జానకీరాములు,ఎల్క నర్సి రెడ్డి, మునీర్, నాగు, వీరన్న, నగేష్,జాఫర్, వెంకన్న, పాండు, తదితరులు పాల్గొన్నారు…

Spread the love