మల్కాజిగిరిలో ఈటల ఆధిక్యం..

నవతెలంగాణ – హైదరాబాద్ : కరీంనగర్, మహబూబ్ నగర్‌, మల్కాజిగిరిలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఆ పార్టీ అభ్యర్థులు బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్‌లు ముందంజలో ఉన్నారు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్‌ దుమ్ములేపుతున్నారు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్‌ 11 వేల ఆధిక్యంతో దూసుకెళుతున్నారు. ఇక అటు వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ లీడింగులో ఉన్నారు. బ్యాలెట్ ఓట్లలో ఆయన ఆధిపత్యం ప్రదర్శించారు. అలాగే తొలిరౌండులోనూ ఆయనకే గంపగుత్తగా ఓట్లు పడ్డట్టు తెలుస్తోంది.

Spread the love