16,17 తేదీల్లో రాష్ట్రస్థాయి షటిల్ బ్యాట్మెంటన్ పోటీలు

State Shuttle Badminton Competitions on 16th and 17thనవతెలంగాణ – కంఠేశ్వర్ 
తెలంగాణ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ షటిల్ బ్యాట్మెంటన్ టోర్నమెంటును నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 16,17 వ తేదీలలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హమ్ దాన్, సెక్రెటరీ చిల్వేరి సత్యనారాయణ,కోషాధికారి గంగా కిషన్ తెలిపారు. స్థానిక నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ లో శనివారం ఉదయం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 70 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ లో గతంలో ఎన్నడూ లేనివిధంగా మొట్ట మొదటిసారిగా రాష్ట్రస్థాయి షటిల్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్ను క్లబ్ అధ్యక్షులుగా ఉన్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. టోర్నమెంట్ కు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆఫీసర్స్ క్లబ్ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్క రించినట్లు తెలిపారు.ఈ టోర్న మెంట్లో పాల్గొనే ఆసక్తి గల క్రీడాకారులు ఆన్లైన్లో 8712300347 కు సంప్రదించాలని ఆయన కోరారు. ఈనెల 13వ తేదీ వరకు టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు.
ఈ పోటీలలో రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల షటిల్ క్రీడాకారులు 35 ఏళ్లకు పైబడి నుంచి 70 సంవత్సరాల వరకు గల క్రీడాకారులు దాదాపు 600 మంది డబుల్స్ షటిల్ పోటీలలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు లక్ష రూపాయల నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాలను అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రీడాకారులకు ఉచిత వసతి తో పాటు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ షటిల్ కోర్టు తో పాటు క్యాప్టెన్ హబ్ లో ఆరు షటిల్ కోర్టులలో ఈ పోటీలను నిష్ణాతులైన కోచ్ లు రెఫరీలుగా మ్యాచ్ కంట్రోలర్ గా వ్యవహరిస్తారని వెల్లడించారు.షటిల్ డబుల్ పోటీలకు గాను వెయ్యి రూపాయల ఎంట్రీ ఫీజు తో పాటు వారి ఆధార్ కార్డు వయసు ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకురావాలని చెప్పారు. 16వ తేదీన జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభిస్తారని, 17వ తేదీన సాయంత్రం బహుమతుల ప్రధానం ముగింపు కార్యకము ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా ప్రతినిధులతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు కూడా హాజరవుతారని చెప్పారు ఈ పోటీలను విజయవంతం చేయవలసిందిగా ఆయన జిల్లా ప్రజలను కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు, భక్తవత్సలం నాయుడు,స్వామి దాస్, దండుస్వామి, ఫైనాన్స్ కమిటీ కో కన్వీనర్ భవంతి దేవిదాస్, ఏ టి ఎస్ శ్రీనివాస్ రవిరాజ్, రచ్చ మురళి, అరవింద్, కిరణ్. తదితరులు పాల్గొన్నారు.
Spread the love