నీట్ పేపర్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: రాష్ర్టపతి ముర్ము

నవతెలంగాణ – ఢిల్లీ: నీట్ పరీక్షలో అవకతవకలపై ఎట్టకేలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పందించారు. నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆమె స్పష్టం చేశారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షల ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహిస్తామని ఉభయ సభలనుద్దేశించి ముర్ము ప్రసంగించారు.

Spread the love