‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా సుకుమార్

నవతెలంగాణ – హైదరాబాద్: గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న భారీ చిత్రం ‘గేమ్ ఛేంజ‌ర్’. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన మూవీ పాట‌లు, టీజ‌ర్.. గేమ్ ఛేంజ‌ర్‌పై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేక‌ర్స్ అమెరికాలో నిర్వ‌హిస్తున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. ఈ నెల 21న డ‌ల్లాస్‌లోని క‌ర్టిస్ క‌ల్‌వెల్ సెంట‌ర్‌, 4999 నామ‌న్ ఫారెస్ట్‌, గార్‌లాండ్ టీఎక్స్ 75040 వేదిక‌గా ఈ మెగా ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. అయితే, తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వ‌స్తున్న‌ ముఖ్య అతిథిని మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు. ఇటీవ‌ల ‘పుష్ప‌-2’తో దేశ‌వ్యాప్తంగా త‌న పేరు మార్మోగెలా చేసిన క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్. ఈ మేర‌కు చిత్ర బృందం ప్ర‌త్యేక పోస్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించింది. ఈ మెగా ఈవెంట్‌కి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా వస్తున్నారంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేసింది. ‘రంగ‌స్థ‌లం’ వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబోలో ‘ఆర్‌సీ17’ రూపొంద‌నుంది. ఈ నేప‌థ్యంలో ఛరిష్మా డ్రీమ్స్‌ అధినేత‌ రాజేశ్‌ కల్లేపల్లి ఆధ్వర్యంలో.. డ‌ల్లాస్‌లో జ‌ర‌గ‌బోతున్న‌ ‘ గేమ్ ఛేంజ‌ర్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతుండ‌టం విశేషం.

Spread the love