మానవత్వం చూపించిన ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు

నవతెలంగాణ – తాడ్వాయి
అడవి ప్రాంతంలోని 4 కిలోమీటర్ల లోపల ఉన్న ఈ మాటేరుతోగు వద్ద వ్యక్తి నీటిలో మనిగిపోయాడన్న సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న తాడ్వాయి ఎస్ఐ ననిగంటి శ్రీకాంత్ రెడ్డి , సిబ్బంది సాంబయ్య, పూజారి రమేష్, ఆర్మీ రమేశ్, కిషోర్ రిషిలతో పాటుగా సిసిఎస్ ములుగు ఇన్స్పెక్టర్ అనుముల శ్రీనివాస్, ఎస్బిఐ ఇన్స్పెక్టర్ ములుగు సట్ల కిరణ్ కుమార్ లు సంఘటన స్థలానికి చేరుకొని నీటిలో నుండి శవాన్ని బయటకు తీసి మృతదేహాన్ని సంఘటన స్థలం నుండి చిలకలగుట్ట వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు  భుజాలపై మోసుకొని వచ్చి, పోస్టుమార్టం కోసం వాహనం ఏర్పాటు చేసి ములుగు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాన్ని నాలుగు కిలోమీటర్ల మేర దట్టమైన అడవి ప్రాంతంలో మోసుకొచ్చి పోస్టుమార్టం నిమిత్తం పంపించిన పోలీసులకు ఉన్నతాధికారులు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love