టీడీపీ నేత ఏవీ భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి.. భార్య మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం టీడీపీ నేత ఏవీ భాస్కర్‌రెడ్డి, శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీదేవి మృతి చెందగా, భాస్కర్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ ఆస్పత్రిలో శ్రీదేవి భౌతికకాయాన్ని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు. ఘటనకు సంబంధించి పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Spread the love