టెస్టు క్రికెట్‌లో టీమ్‌ఇండియా రికార్డు స్కోరు..

నవతెలంగాణ – హైదరాబాద్: మహిళా టెస్టు క్రికెట్‌లో టీమ్‌ఇండియా రికార్డు నమోదు చేసింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 603/6 స్కోరు చేసి డిక్లేర్డ్‌ చేసింది. దీంతో ఉమెన్స్‌ టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా భారత్‌ అవతరించింది. దక్షిణాఫ్రికాతో ఓవర్‌ నైట్‌ 525/4 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ అదే దూకుడు కొనసాగించింది. హర్మన్‌ (69), రిచా ఘోష్‌ (86) ఐదో వికెట్‌కు 143 పరుగులు జోడించారు. ఆ తర్వాత వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసిన టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ప్రస్తుతం లంచ్ బ్రేక్‌ సమయానికి సఫారీల జట్టు వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. క్రీజ్‌లో లారా (17*), అన్నెకె (12*) ఉన్నారు.

Spread the love