తెలంగాణలో పాలిసెట్‌ ఫలితాలు విడుదల

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘పాలిసెట్‌’ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ విడుదల చేశారు. మే 17న జరిగిన ఈ పరీక్షకు మొత్తం 1,05,742మంది దరఖాస్తు చేసుకోగా.. మొత్తంగా 98,273(92.94%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 54,700 మంది అబ్బాయిలు ఉండగా, 43,573 మంది అమ్మాయిలు ఉన్నారు. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల‌తో పాటు వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌వ‌న, వెట‌ర్న‌రీ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశాల నిమిత్తం ఈ పరీక్ష నిర్వహించారు.

Spread the love