అక్కంపేట 12వ వార్డులో తాత్కాలిక నీటి సరఫరా

– ‘నవతెలంగాణ’ కథనానికి స్పందన
నవతెలంగాణ-ఆత్మకూర్‌
మండలంలోని అక్కంపేట గ్రామంలో 12 వ వార్డు పరిధిలో వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా ఆదివారం తాత్కాలిక నీటి సరఫరా చేశారు. అక్కంపేట ’12వ వార్డులో నెలల తరబడి నీళ్లు రావడం లేదు’ అనే వార్త కథనం నవ తెలంగాణ పత్రికలో ప్రచురితమైన విషయం విధితమే.వెంటనే స్పందించిన మండల ఎంపీడీవో శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి సంపూర్ణ గ్రామపంచాయతీ సిబ్బందితో 12వ వార్డులో వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా నీటి సరఫరా చేయించారు. నవతెలంగాణ పత్రిక విలేకరితో ఎంపీడీవో శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో అక్కంపేట గ్రామంలో పర్యటించి వార్డులలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించి నీటి సరఫరా చేపిస్తామని తెలిపగ..వార్డు సభ్యులు మాట్లాడుతూ మండల అధికారులు వార్డులో పర్యటించి నీటి సమస్యను పూర్తిగా పరిష్కరించాలని వేడుకుంటున్నారు.దీంతో నవ తెలంగాణ పత్రికకు వార్డు సభ్యులు,ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love