కోడలిని హత్య చేసిన అత్త

నవతెలంగాణ హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్ లో కోడలిని అత్త అతి కిరాతకంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్ లో అజ్మీరీ బేగమ్ కుటుంబం నివాసం ఉంటుంది. ఆ కుటుంబంలో సమస్యలు తలెత్తడంతో అజ్మీరీ బేగమ్ కు, అత్తకు మధ్య వివాదం జరిగింది. దీంతో ఇద్దరు పరస్పరంగా దాడులు చేసుకున్నారు.  దీంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన అత్త కోడులిని చున్నీతో గొంతు నులిమి చంపింది. ఇంతటితో ఆగిందా తనకేం సంబంధం లేదన్నట్టు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన కోడలికి తనకు మధ్య గొడవ జరిగిందని ..తన కోడలు ఉన్నట్టుండి ఉలుకూ పలుకూ లేకుండా పడిపోయిందని చెప్పింది. వివరాలు తీసుకున్న పోలీసులు క్లూ టీంతో ఘటనా స్థలానికి చేరుకన్నారు.  ప్రాధామిక విచారణలో అత్తే చున్నీతో హత్య చేసిందని కనిపెట్టారు.  దీంతో అత్తను అదుపులోకి తీసుకుని  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు బోరనవిలపిస్తున్నారు.

Spread the love