కొన్ని స్కూల్స్ ట్యూషన్ ఫీజు సంవత్సరానికి రూ.2 లక్షలు, హాస్టల్ ఫీజు లక్ష వసూలు చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోదా? ఎంత ఎక్కువ డబ్బులు స్కూల్ ఫీజులకు చెల్లిస్తే అంత గొప్ప చదువును తమ పిల్లలకు చదివిస్తున్నట్లు భావిస్తున్న మధ్య తరగత మనస్తత్వాన్ని విద్యాసంస్థలు బాగా సొమ్ము చేసుకుంటున్నాయి. విద్యను మంచి లాభసాటి వ్యాపారంగా భావిస్తున్న పలు సంస్థలు క్వాలిఫైడ్ టీచర్స్, లెక్చరర్స్ను నియమించడం లేదు. మరి కొన్ని సంస్థలు తమ ఫ్యాకల్టీకి లక్షల్లో వేతనం ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నాయి.
విద్యారంగ నిపుణులు, ప్రభుత్వ శాఖలు నిర్దేశించిన కాలిఫైడ్ ఫ్యాకల్టీ కావాలి కానీ, లక్షల్లో వేతనం ఇస్తే మాత్రం విద్యార్థులకు అదనంగా బోధిóంచేదే ముంటుంది?
జూన్ నెల రాగానే విద్యా సంవత్సరం ఆరంభం. పిల్లలు ఆటా, పాటలకు స్వస్తి చెప్పి ఇక బడికి పయనం. ప్రయివేటు స్కూళ్ల విద్యార్థులకు పుస్తకాల మోత. తల్లిదండ్రులకు ఫీజుల వాత. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత. ప్రభుత్వ పెద్దల, అధికారుల హడావుడి నటన. షరా మామూలుగానే మౌలిక సమస్యలు, ఫీజుల వడ్డింపులు. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటున్నదా అంటే లేదనేచెప్పాలి. పైగా ఏప్రిల్, మే, జూన్ వచ్చిందంటే చాలు ప్రయివేటు విద్యాసంస్థల ప్రకటనల జోరు. పట్టణాల్లో ఎటు వైపు తలెత్తి చూసినా విద్యా సంస్థల హోర్డింగులే. ‘మాది స్టేట్ ర్యాంక్ అంటే మాది స్టేట్ ర్యాంక్’ అని, మాకు ఇన్ని ర్యాంక్లు అన్ని ర్యాంక్లని ప్రచార హోరు తప్ప ఏఒక్క విద్యా సంస్థ తమ సంస్థలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ర్యాంకుల స్థాయి ఎంతనేది ఎవరికీ తెలియదు. దీన్ని కూడా విద్యాశాఖ నియంత్రించడం లేదంటే ఏమనుకోవాలి? వైద్య విద్య, ఇంజినీరింగ్, డిగ్రీ విద్యా తదితర కోర్సులకు ప్రభుత్వం నిర్దిష్టమైన ఫీజు స్ట్రక్చర్ నిర్ణయించింది. కానీ పాఠశాల విద్యకు, ఇంటర్ విద్యకు నిర్దిష్టమైన ఫీజు విధానం లేదు. విద్యారంగ నిపుణులు, విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ అసోసియేషన్స్ ఒత్తిడితో ప్రయివేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ విధివిధానాలపై వేసిన తిరుమలరావు కమిటీ సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టలేదు. ఏటా గరిష్టంగా ఫీజులు 10శాతం పెంచుకోవచ్చు అని చెప్పినట్లు మాత్రం వెల్లడైంది. ఆయా విద్యా సంస్థలు ఇప్పటికే వసూలు చేస్తున్న ఫీజులు ఏ స్థాయిలో ఉన్నాయి. వాటికి ఉన్న ప్రమాణాలు ఏమిటి? ఇప్పటికే అసాధారణంగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలలో ఫీజు తగ్గింపు చర్యలు తీసుకుంటారా లేదా అనే అంశాలు వెల్లడి కాలేదు. ఆ తర్వాత మంత్రివర్గ ఉప సంఘం వేశారు.10మందితో కూడిన స్కూల్ లెవెల్ కమిటీ ఫీజులు నిర్ణయించాలని మంత్రివర్గ సబ్ కమిటీ జీఓ నెంబర్ ఒకటిని దృష్టిలో పెట్టుకొని చెప్పినట్లు ఉన్నది. కానీ, ఆచరణలో పెట్టలేదు. పాఠశాల విద్యలో ప్రయివేటు విద్యా సంస్థలు ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉండాలో ఉన్నంతలో శాస్త్రీయం గా విద్యాశాఖ జీఓ నెంబర్లో స్పష్టంగా పేర్కొంది. ఈ జీఓను అమలు చేయకుండా తెలంగాణ సర్కార్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నది.
విద్యాశాఖ జీఓ ఎంఎస్ నెంబర్1 ప్రకారం విద్యా సంస్థ ప్రతి బ్రాంచ్కు సంబందించిన ఆర్థిక లావాదేవీలు నిర్దేశిత ఫారంలో సంబందిత విద్యాధికారికి ఇవ్వాలి. సెప్టెంబర్ 30 చివరి గడువుగా ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అకౌంట్స్ స్టేట్మెంట్ చార్టర్డ్ అకౌటేంట్ చేత ఆడిట్ చేసిన రిపోర్ట్ను విద్యాధికారికి ఇవ్వాలి. విద్యా సంస్థలోని ప్రతీ బ్రాంచ్లో పాలకవర్గం ఏర్పడాలి. పాలకవర్గంలో విద్యా సంస్థ అధ్యక్షులు, విద్యాసంస్థ సెక్రెటరీ, కరస్పాండెంట్, మేనేజర్, ప్రిన్సిపాల్, హెడ్మాస్టర్ బోధన సిబ్బంది నుండి ఒకరు, విద్యార్థుల తల్లిదండ్రులలో నుండి జిల్లా విద్యాధికారిచే నియమించబడిన చదువుకున్న తల్లి ఒకరు ఉండాలి. ఇవన్నీ ఎక్కడైనా జరుగు తున్నాయా? పాలకవర్గం సంవత్సరంలో కనీసం మూడు సార్లు సమావేశం కావాలి. పాలకవర్గమే ఫీజులు నిర్ణయించాలి. ఫీజులు నిర్ణయించేటప్పుడు బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, సౌకర్యాలు, స్కూలు నిర్వహణ ఖర్చులు, స్కూలు అభివృద్ధి ఖర్చులను పరిగణంలో ఉంచుకొని ఫీజుల స్ట్రక్చర్ తయారు చేయాలని ఉన్నప్పటికీ దీనిపై నిర్దిష్టమైన కార్యచరణ రూపుదాల్చింది లేదు. జిల్లా కలెక్టర్ లేదా తాను సిఫార్సు చేసిన అధికారి, జిల్లా విద్యాధికారి, జిల్లా ఆడిట్ అధికారులతో కూడిన డీఎఫ్ఆర్సీ స్కూల్ గవర్నింగ్బాడి ప్రతిపాదించిన ఫీజు స్ట్రక్చర్ను, తల్లిదండ్రులు విన్నపాన్ని పరిగణలోకి తీసుకోని ఫీజులను నిర్ణయించాలి. డీఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజులనే ప్రతి ప్రయివేటు స్కూల్ యాజమాన్యం వసూలు చేయాలి. ఇది ఏ ఒక్క విద్యాసంస్థలోనూ అమలవ్వడం లేదనేది విద్యార్థి సంఘాల ఆరోపణ. బోధనా, బోధనేతర సిబ్బందిని ”స్టాఫ్ సెలక్షన్ కమిటీ” ద్వారా నియమించాలి. పోస్టుల వివరాలు సర్క్యులేషన్ అధికంగా ఉన్న కనీసం రెండు తెలుగు దినపత్రికలలో ప్రకటనలివ్వాలి. పోస్టుల భర్తీకి సంబంధిత విద్యాధికారి అనుమతి తీసు కోవాలి. ఇవేవీ ఆచరణలో అమలు కావడం లేదు. ఫీజుల వసూలు, మౌలిక వసతుల కల్పనా తదితర అంశాలపై జీఓలో పేర్కొన్న విధంగా అమలు చేయాలనీ, అందుకు జిల్లా విద్యాధికారి వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యా శాఖ 2015 జూన్ 12న ప్రోసిడింగ్స్ ఇచ్చినప్పటికీ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.
విద్యార్థుల నుండి వసూలు చేసే ఫీజులలో 50శాతం టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్నకు వేతనాలు చెల్లించాలి. 15శాతం ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, గ్రూప్ ఇన్సూరెన్స్ తదితరాలకు వినియోగించాలి. బిల్డింగ్ రెంట్, కరెంటు, వాటర్ బిల్లులు, లైబ్రరీ బుక్స్, ల్యాబ్, కెమికల్స్, ఆడిట్, ఆఫీసు తదితర నిర్వహణ ఖర్చులకు 15శాతం మాత్రమే వినియోగించాలి. మరొక 15శాతం స్కూల్ అభివృద్ధికి అదనపు రూమ్ల నిర్మాణం, ల్యాండ్ కొనుగోలు, కొత్త కోర్సులు, సెక్షన్స్ కోసం వినియోగించుకునే అవకాశం ఉంది. స్కూల్ యజమాన్యం 5శాతం మాత్రమే లాభాలు తీసుకోవాలి. ఉదాహరణకు ఒక స్కూల్లో 1 నుండి 10వ తరగతి వరకు మొత్తం విద్యార్థులు 600మంది ట్యూషన్ ఫీజు సంవత్సరానికి సగటున రూ.50 వేలు ఉన్నది అనుకుంటే స్కూల్ సంవత్సర ఆదాయం మొత్తం రూ.3కోట్లు వస్తుంది. ఫీజులో 50శాతం అంటే రూ.1 కోటి 50లక్షలు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు వేతన చెల్లింపులు చేయాలి. రూ.45లక్షలు పీఎఫ్, బోనస్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి చట్టబద్ద సౌకర్యాలకు చెల్లించాలి. కానీ ఒక అంచనా ప్రకారం 30 నుండి 35శాతం మాత్రమే వేతనాలు, సౌకర్యాల కోసం చెల్లిస్తున్నారు. సంవత్సరంలో 12నెలలకు వేతనాలు చెల్లించ వలసి ఉండగా, చాలా యాజమాన్యాలు పది లేదా పదిన్నర నెలలకు మాత్రమే వేతనాలు ఇస్తున్నాయి. ఫీజులలో స్కూల్ యజమాన్యం 5శాతం మాత్రమే లాభాలు పొందాలి. కానీ కొన్ని స్కూల్ యాజమాన్యాలు ప్రతీ సంవత్సరం 30 నుండి 40శాతం లాభాలు పొందుతున్నాయి. 600మంది విద్యార్థులకే ఈ విధంగా ఉంటే… వెయ్యి, రెండువేలు, ఐదువేల మంది విద్యార్థులు కలిగి ఉండి, ట్యూషన్ ఫీజు సంవత్సరానికి లక్ష, ఆపైన వసూలు చేస్తున్న విద్యా సంస్థల లాభాలు ఎంత ఉండాలి? అందరూ ఆలోచించాల్సిన అంశమిది. రిజిస్ట్రేషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, వ్యాన్ ఫీజు, యూనిఫాం, షూస్, పుస్తకాల ఖర్చులు తడిసి మోపెడవు తున్నాయి. కొన్ని స్కూల్స్ ట్యూషన్ ఫీజు సంవత్సరానికి రూ.2 లక్షలు, హాస్టల్ ఫీజు లక్ష వసూలు చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోదా? ఎంత ఎక్కువ డబ్బులు స్కూల్ ఫీజులకు చెల్లిస్తే అంత గొప్ప చదువును తమ పిల్లలకు చదివిస్తున్నట్లు భావిస్తున్న మధ్య తరగత మనస్తత్వాన్ని విద్యాసంస్థలు బాగా సొమ్ము చేసుకుంటున్నాయి. విద్యను మంచి లాభసాటి వ్యాపారంగా భావిస్తున్న పలు సంస్థలు క్వాలిఫైడ్ టీచర్స్, లెక్చరర్స్ను నియమించడం లేదు. మరి కొన్ని సంస్థలు తమ ఫ్యాకల్టీకి లక్షల్లో వేతనం ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నాయి. విద్యారంగ నిపుణులు, ప్రభుత్వ శాఖలు నిర్దేశించిన కాలిఫైడ్ ఫ్యాకల్టీ కావాలి కానీ, లక్షల్లో వేతనం ఇస్తే మాత్రం విద్యార్థులకు అదనంగా బోధిóంచేదే ముంటుంది? బోధన పద్ధతితోపాటు విద్యార్థుల గ్రహణశక్తి చాలా ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు. గ్రహణశక్తి పెంపొంద డానికి ఆహారం, ఆరోగ్యం, గాలి, వెలుతురు, శబ్దం, పరిసరాల తోపాటు సామాజిక ప్రభావం కూడా ఉంటుంది. ఇవేమీ మార్చకుండా భవి భారత పౌరులను యంత్రాలు గా మార్చడం వలన ప్రయోజనం శూన్యం. హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆందోళనలు పోరాటాలు చేస్తున్నారు. కొన్ని ముఖ్యమైన విద్యా సంస్థలలో ఫీజులను పెంచకుండా నిరోధించే ప్రయత్నం కూడా చేశారు. అందరూ ఆదిశగా ఆలోచించి అడుగేస్తే విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రణపై ప్రభుత్వంపై ఒత్తిగి పెరిగే అవకాశం ఉంటుంది.
గీట్ల ముకుందరెడ్డి
9490098857