టీ ఇవ్వలేదని ఆపరేషన్ ఆపేసిన డాక్టర్

నవతెలంగాణ హైదరాబాద్: టీ ఇవ్వలేదని ఆపరేషన్ ఆపేశాడోక డాక్టర్. విస్తుగోలిపే ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని ఖట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోవడానికి నలుగురు మహిళలు వచ్చారు. వాళ్లకు సర్జరీ చేయటానికి వెళ్లే ముందు డాక్టర్‌ తేజ్‌రామ్‌ భలవి టీ కోసం అక్కడ వాళ్లని అడిగారు. అయితే ఎవరూ డాక్టర్‌కు టీ ఇవ్వలేదు. ఈ క్రమంలో సర్జరీ చేసేందుకు ఆపరేషన్‌ థియేటర్‌కు వెళ్లిన డాక్టర్‌ నలుగురు మహిళలకు మత్తు మందు ఇచ్చి..  ఆపరేషన్‌ చేయకుండానే థియేటర్‌ నుంచి బయటకు వచ్చేశాడు. కేవలం టీ ఇవ్వలేదనే కోపంతో సర్జరీలు చేయకుండానే ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇలాంటి ఘటనలు వైద్య వృత్తికే కళంకం.

Spread the love