కాంగ్రేస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా రేపే..ఎంపిక భాధ్యత రేవంత్ దే ..

నవతెలంగాణ – హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. కాబట్టి తెలంగాణలోని పార్టీలన్నీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్‌ను సిద్దం చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. రేపు టీ కాంగ్రెస్ కూడా ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది. ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత రేవంత్ కి అధిష్ఠానం అప్పజెప్పింది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను రేవంత్ హై కమాండ్‌కి తెలుపనున్నాడు. గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని హస్తం నేతలు అంటున్నారు. తొలి జాబితాలో సీటు దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో ఏకాభిప్రాయం ఉన్న సీట్లను రేపు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించనుంది.

Spread the love