కేసీఆర్ ఇంటికి ప్రభుత్వ ప్రతినిధులు..

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాల్, అర్విందర్ సింగ్ వెళ్లారు. ఆవిర్భావ వేడుకలకు ఆయనను ఆహ్వానించిన అనంతరం కేసీఆర్ నివాసం బయట వారు మీడియాతో మాట్లాడుతూ… ఆహ్వాన పత్రికను అందించడంతో పాటు కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను కూడా అందించినట్టు చెప్పారు. ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఉందని… అందుకే ఆహ్వానించినట్టు చెప్పారు. ఆహ్వానం పట్ల కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో… ఉద్యమనేతగా ఆయనను ఆహ్వానించామన్నారు. ఈ వేడుకలలో కేసీఆర్ భాగస్వాములు అవుతారని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, విపక్షనేతగా, ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

Spread the love