షర్మిలకు లైన్ క్లియర్..

నవతెలంగాణ హైదరాబాద్: ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) రాజీనామా చేశారు. సోమవారం పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రుద్రరాజు… రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు (AICC Chief Mallikarjuna Kharge) అందజేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రెడ్డి (YS Sharmila Reddy) పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. నిన్న (ఆదివారం) మణిపూర్‌లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఇక  పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలను లాంఛనంగా ప్రకటించడమే మిగిలి ఉంది.

Spread the love