నవతెలంగాణ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు, ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు లోక్సభకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణలో అత్యధికంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 13.22శాతం, అత్యల్పంగా హైదరాబాద్లో 5.06శాతం పోలింగ్ నమోదైంది. ఏపీలో అత్యధికంగా వైఎస్ఆర్ జిల్లాలో 12.09శాతం, అత్యల్పంగా గుంటూరులో 6.17శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు.