– ఇద్దు నిందుతులు అరెస్ట్ రిమాండ్ కి తరలింపు..
– 25 గ్రాముల బంగారం స్వాధీనం..
– వెల్లడించిన వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
24 గంటల్లో దొంగతనం కేసును చేధించిన వేములవాడ రూరల్ పోలీసులు. మంగళవారం వేములవాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి.ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామం రాజానగర్ కి చెందిన శ్రీరాముల శ్రీనివాస్ తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా తన ఇంటికి కలర్ వేయడానికి వేములవాడ కు చెందిన ఇద్దరు వ్యక్తులు నందెల్లి అనిల్ కుమార్, సయ్యద్ అఫ్రోజ్ లను కలసి కలర్ వేయడానికి ఒప్పదం చేసుకున్నారని తెలిపారు. గత నెలరోులు గా ఇంటికి కలర్ వేస్తుండగా ఆదివారం రోజు శ్రీనివాస్ తన భార్య కలిసి బెజ్జంకి వెళ్లి వచ్చేసరికి ఇంటిలో వున్న హ్యాండ్ బ్యాగ్ కనిపించకపోవడంతో అనుమానంతో ఇల్లు అంత వెతకగా బ్యాగ్ కనిపించలేదు, బ్యాగ్ లో 25 గ్రాముల బంగారం ఎవరో గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్ళినట్టుగా గుర్తించి వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసివేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్ ఆ్వర్యంలో, ఎస్.ఐ మారుతి, సిబ్బంది తో టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయగా ఇంటికి కొద్దీ దూరంలో బ్యాగ్ కనిపింఛగా అట్టి బ్యాగ్ పై కలర్ మరకలు ఉండగా ఇల్లుకు కలర్ వేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను రాజనగర్ వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా అట్టి దొంగతనం తామే చేసినట్టుగా ఒప్పుకున్నట్లుగా ఆమె తెలిపారు. వారి వద్ద నుండి 25గ్రాముల బంగారం సీజ్ చేసి వారిని ఈ రోజు రిమాండ్ కి తరలించడం జరిగింది ఏ ఎస్ పి శేషాద్రిని రెడ్డి వెల్లడించారు.24 గంటల్లో దొంగతనం కేసును చేధించిన వేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ మారుతి, సిబ్బంది తిరుపతి, శంకర్, యాకూబ్, రాజశేఖర్, వెంకటేష్ లను ఏఎస్పీ అభినందించారు.