
అటు ఇంగ్లండ్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. జేమీ స్మిత్, బ్రైడాన్ కార్స్ ఆ జట్టు తరఫున ఈ మ్యాచ్లో అరంగేట్రం చేస్తున్నారు. ఇక ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో ఆతిథ్య భారత్ తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించి బోణీ కొట్టిన విషయం తెలిసిందే. ఇక బ్యాటింగ్ ప్రారంబించిన ఇంగ్లండ్ 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 6 పరుగుల వద్ద సాల్ట్ (4) ఆర్షదీప్ సింగ్ బౌలింగ్ లో అవుట్ కాగా 26 పరుగుల వద్ద బెన్ డకెట్ (3) వాషీంగ్ టన్ సుందర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో బట్లర్ 18, హరీ బ్రూక్ 1 పరుగులతో ఉన్నారు.