ప్రశాంతమైన కాలనీలో ఉండాలని వచ్చిన ఫ్యామిలీకి వారి పిల్లల వలన ఆ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. చివరికి ఆ తండ్రి పిల్లలకి తోడుగా ఉండి సొసైటీలో తన ఫ్యామిలీని చూసి గర్వపడేలా ఎలా చేసుకున్నాడనే ఫ్యామిలీ డ్రామా కథే ‘డియర్ జిందగి’. రాజారవీంద్ర సమర్పణలో సాయిజా క్రియేషన్స్, మహా సినిమా పతాకంపై రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, నీల ప్రియా, మిర్చి కిరణ్, హర్షవర్ధన్ నటీనటులుగా పద్మారావ్ అబ్బిశెట్టి (పండు)ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి నిర్మిస్తున్న చిత్రమిది. ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కెమెరా స్విచ్చాన్తో పాటు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ,’రెగ్యులర్గా కాకుండా కొత్త కాన్సెప్ట్తో ప్రస్తుతం సమాజంలో జరిగే సమస్యలను ఎత్తి చూపుతూ తీస్తున్న చిత్రమిది. ఇందులో నేను ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను’ అని తెలిపారు. ”దండుపాళ్యం’ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు అసోసియేట్ పండు చెప్పిన కథ మాకు నచ్చడంతో ఈసినిమా తీస్తున్నాం’ అని నిర్మాత శరత్ చంద్ర చల్లపల్లి అన్నారు.
సహ నిర్మాత క్రాంతి ముండ్ర మాట్లాడుతూ,’ఇది ఒక మంచి క్రేజీ ఫ్యామిలీ కథ. మ్యూజికల్గా కూడా మంచి పాటలు కుదిరాయి. కీరవాణి అసిస్టెంట్ యం.ఎబెనెజర్ పాల్ మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు’ అని చెప్పారు.దర్శకుడు పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) మాట్లాడుతూ, ‘ఇప్పటి వరకు ఇలాంటి కథ రాలేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది’ అని అన్నారు.