నవతెలంగాణ-హైదరాబాద్ : విశాఖలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ కోసం వచ్చిన ఓ మహిళను సిబ్బంది వేధింపులకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం విశాఖకు చెందిన ఓ మహిళ తలకు గాయమై సోమవారం రాత్రి ఆస్పత్రికి వచ్చింది. స్కానింగ్ చేయించాలని వైద్యులు సూచిచండంతో .. అదే ఆస్పత్రిలోని స్కానింగ్ సెంటర్కు వెళ్లింది.
ఇదే అదునుగా భావించిన స్కానింగ్ సెంటర్ ఇన్ఛార్జి ప్రకాశ్ .. స్కానింగ్ కోసం దుస్తులు తీసేయాలని చెప్పాడు. ఆ తర్వాత ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు ప్రకాశ్కు దేహశుద్ధి చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న విశాఖ మూడో పట్టణ సీఐ రమణయ్య ఆస్పత్రికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో రోగులు నరకం చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.