నవతెలంగాణ – కర్ణాటక
దేశంలో టమాటా ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఇదే మంచి సందు అనుకున్నారో, ఏమో కానీ, దొంగల దృష్టి ఇప్పుడు అటువైపు పడింది. కర్ణాటకలో ఓ రైతు రెండెకరాల్లో పండించిన టమాటాలను దొంగలు ఎంచక్కా కోసుకెళ్లిపోయారు. వాటి విలువ రూ. 2.5 లక్షల పైమాటేనని బాధిత మహిళా రైతు ధరణి వాపోయింది. పంటను కోసి బెంగళూరు మార్కెట్కు తరలించాలని అనుకున్నామని, అంతలోనే దొంగలు మొత్తం దోచుకుపోయారని పేర్కొంది. ప్రస్తుతం బెంగళూరులో కిలో టమాటా రూ. 120కిపైనే పలుకుతోంది. టమాటాలను చోరీ చేసిన దొంగలు మిగతా పంటను కూడా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. టమాటాల చోరీపై హలెబీడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.