నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ మల్కాజిగిరి నేతలకు బెదిరింపు కాల్స్ రావడం స్థానికంగా కలకం రేపింది. స్థానిక నాయకులు, కార్పొరేటర్లకు రెండు రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అదికూడా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫోన్ నెంబర్తో బెదిరింపు కాల్స్ వస్తుండటంతో బీఆర్ఎస్ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ ఉపయోగించి అగంతకులు బెదిరింపు కాల్స్ చేస్తున్న ట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మల్కాజిగిరి పరిధిలోని పలువురు కార్పొరేటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.