ఆర్టీసీకి తిరుమల దర్శన టికెట్ల కోటా పెంపు

నవతెలంగాణ – సత్తెనపల్లి: ఏపీఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి తిరుమలకు చేరుకునే వారికి అందించే దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం పెంచింది. మొన్నటివరకు రోజూ ఆర్టీసీ ప్రయాణికులకు రాష్ట్రవ్యాప్తంగా 600 టికెట్లు ఇస్తుండగా తాజాగా ఆ సంఖ్యను 1000కు పెంచింది. బస్సు ఛార్జీకి తోడు శ్రీవారి దర్శనానికి రూ.300 దర్శన టికెట్‌ను ప్రయాణికులు  కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బుక్‌ చేసుకునే టికెట్లు ఈ నెల 15 నుంచి అక్టోబరు 7వ తేదీలోపు ప్రయాణం, దర్శనానికి ఉపయోగపడతాయి. అధికారిక వెబ్‌సైట్‌ www.apsrtconline.in లో అదనపు కోటా టికెట్ల బుకింగ్‌ మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చిందని పల్నాడు జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి ఎన్‌.వి.శ్రీనివాసరావు ‘న్యూస్‌టుడే’తో చెప్పారు.

Spread the love