నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రధాని మోడీ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఆయన రూ.2లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు కూటమి నాయకులు తెలిపారు. తొలుత సీఎం చంద్రబాబు, పవన్తో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం ఎయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లోని సభాస్థలి వద్దకు చేరుకుంటారు. సా.4.15 గంటలకు విశాఖ చేరుకోనున్న మోడీ బహిరంగ సభ, శంకుస్థాపనలు ముగించుకొని రా.7.15ప్రాంతంలో తిరుగు పయనమవుతారు.