గ్రాడ్యుయేట్ల ఓటర్ నమోదుకు రేపే లాస్ట్ డేట్

నవతెలంగాణ – హైదరాబాద్: కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ నమోదు గడువు రేపటి(బుధవారం)తో ముగియనుంది. 2019లో ఓటరు దరఖాస్తుల సంఖ్య 1.96 లక్షలు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 2.40 లక్షలకు పెరిగింది. కాగా ఇంకా సగం మంది గ్రాడ్యుయేట్లు ఓటు నమోదుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్, అభ్యంతరాల స్వీకరణ తర్వాత డిసెంబర్ 30న ఫైనల్ లిస్ట్ ను రిలీజ్ చేస్తామని అధికారులు తెలిపారు.
Spread the love