కొవ్వొత్తుల వెలుగుల‌తో అమ‌రుల‌కు నివాళులు..

నవతెలంగాణ-హైద‌రాబాద్ : తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా.. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకొనేలా రాష్ట్ర రాజ‌ధాని హైదరాబాద్‌ నడిబొడ్డున తెలంగాణ‌ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కొవ్వొత్తుల వెలుగుల‌తో సీఎం కేసీఆర్, ప్ర‌జాప్ర‌తినిధులు నివాళుల‌ర్పించారు. అమ‌రుల నివాళి గీతంతో నివాళుల‌ర్పించారు. స‌భ‌లో 10 వేల మంది క్యాండిల్ లైట్ ప్ర‌ద‌ర్శిస్తూ అమ‌రుల‌కు నివాళుల‌ర్పించారు. అనంత‌రం ఎంపిక చేసిన ఆరుగురు అమ‌ర‌వీరుల కుటుంబాల‌ను కేసీఆర్ స‌త్క‌రించారు.

Spread the love