మనకు ప్రకతిపరంగా లభించే వాటితో కొన్ని ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాంటి కొన్ని ఆరోగ్య చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
– అరికాళ్లు విపరీతంగా మంట పుడుతుంటే గోరింటాకు గానీ నెయ్యి గానీ సొరకాయ గుజ్జు గానీ పూస్తే ఉపశమనం కలుగుతుంది.
– ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు మూడు వెల్లుల్లి రేకులు తింటే రక్తపోటు, కడుపులో మంట, నులిపురుగులు తగ్గుతాయి.
– పంటినొప్పిగా ఉంటే లవంగం చప్పరించడం వల్ల కొంత తగ్గుతుంది.
– చిటికెడు పసుపు గ్లాసు పాలల్లో వేసి కాచి ప్రతిరోజు ఉదయాన్నే తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతుంది.
– తులసి ఆకుల రసంలో ఒక స్పూను తేనె కలిపి చప్పరిస్తే జలుబు, గొంతునొప్పి, దగ్గు వెంటనే తగ్గుతాయి.
– కాలిన గాయాలకు టూత్ పేస్టును రాయడం వల్ల మంట తగ్గడమే కాకుండా గాయం తొందరగా తగ్గిపోతుంది.
– క్యారెట్ రసాన్ని, నిమ్మ రసాన్ని సమపాళ్లల్లో తీసుకుని భోజనానికి ఒక గంట ముందు తీసుకోవడం వల్ల ముక్కు సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందవచ్చు.
ఇట్ల చేద్దాం
అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేసేపుడు.. అల్లం పొట్టు పడేయకుండా శుభ్రంగా కడిగి డబ్బాలో వేసుకుని ఫ్రిజ్లో నిల్వ ఉంచుకుంటే.. అల్లం టీ తయారు చేసుకోవాలి అనుకున్నపుడు ఉపయోగించుకోవచ్చు.