నవతెలంగాణ – హైదరాబాద్: టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్టికెట్లు విడుదలయ్యాయి. హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్లో టీఎస్పీఎస్సీ అందుబాటులో ఉంచింది. గతంలో లీకేజీ కారణంగా రద్దయిన పరీక్ష హాల్టికెట్లు చెల్లవని.. కొత్తవి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. జూన్ 11న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. 503 పోస్టులకు గాను 3.80లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.