మాజీ ఎమ్మెల్యే హ‌త్య కేసులో ట్విస్ట్

నవతెలంగాణ – హర్యానా: ఇండియ‌న్ నేష‌న‌ల్ లోక్‌ద‌ళ్ పార్టీ చీఫ్‌, మాజీ ఎమ్మెల్యే న‌ఫే సింగ్ రాథీ హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఘ‌ట‌న‌లో 12 మందిపై కేసు బుక్ చేశారు. దాంట్లో హ‌ర్యానా మాజీ ఎమ్మెల్యే న‌రేశ్ కౌశిక్‌పై కూడా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేపై కూడా కేసు బుక్ చేశారు.  బ‌హ‌దూర్‌ఘ‌ర్ ప‌ట్ట‌ణంలోని బారాహి లెవ‌ల్ క్రాసింగ్ వ‌ద్ద కారులో వ‌చ్చిన వ్య‌క్తులు విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపారు. ఈ అటాక్‌లో రాథీ గ‌న్‌మెన్లు గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఎస్‌యూవీలో ముందు సీట్లో కూర్చున్న మాజీ ఎమ్మెల్యేపై చాలా స‌మీపం నుంచి ఫైరింగ్ చేశారు. కాల్పులు జ‌రిపిన త‌ర్వాత దుండ‌గులు పారిపోయారు.

Spread the love