గోదావరిలో ఇద్దరు గల్లంతు…

నవతెలంగాణ – అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భీమలాపురం వద్ద విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వశిష్ట గోదావరిలో బోటు బోల్తా పడగా.. యువకులు నదిలో మునిగిపోయారు. కొబ్బరికాయల లోడు అధిక బరువుతో పడవ వస్తుండగా ఈ ఘటన జరిగింది. గల్లంతైన వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. పడవలో అధిక లోడు కారణంగానే ఈ పడవ మునిగినట్లు అధికారులు గుర్తించారు. నదిలో మునిగిపోయిన ఇద్దరు యువకుల ఆచూకీ గురించి తీవ్రంగా ఆరా తీస్తున్నారు.

Spread the love