తమిళనాడులో విషాద.. పిడుగు పడి ఇద్దరు మృతి

నవతెలంగాణ – తమిళనాడు: తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. పిడుగు పడి ఇద్దరు మృతి చెందగా.. 18 మంది గాయపడ్డారు. ఈ ఘటన మధురై జిల్లాలోని కీరనూర్ గ్రామంలో జరిగింది. వర్షం పడుతుందని చెట్టు కింద ఉన్న వారిపై పిడుగు పడింది. దాంతో ఇద్దరు మృతి చెందినట్లు మధురై ఎస్పీ ఆర్.శివ ప్రసాద్ తెలిపారు. మృతులు అగ్నిరాజ్ (25), సెల్వ (23)గా గుర్తించామన్నారు.
Spread the love