అమ్మ ఆదర్శ పాఠశాలలో ఇంకా పూర్తవని పనులు..

నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలోని  న్యాల్కల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద దాదాపు రూ.11 లక్షలు రూపాయల నిధులతో పనులు ప్రారంభించడం జరిగింది. పాఠశాలలు పున ప్రారంభమైన ఇంకా పనులు కంప్లీట్ కాకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందికి గురి రావాల్సి వస్తుంది. రోడ్డు పక్కన  ఒక ప్రైవేటు వ్యక్తుల ఇంటి ఆరు బయట కూర్చుని విద్యనభ్యాసించే దినస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా పంచాయతీరాజ్ అధికారులు, మండల విద్యాధికారి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తొందరగా విద్యార్థులకు తమ పాఠశాలలోనే విద్యను అభ్యసించే విధంగా చూడాలని వారు కోరుకుంటున్నారు. రోడ్డు పక్కనే ఆ ప్రైవేట్ వసతిగృహం ఉండటం వలన వారి పైన దుమ్మూ, ధూళీ పడుతూ ఉంది. అయినా అలాగే  ఎండలో కూడా కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది.

Spread the love