రజనీకాంత్ టైటిల్ పాత్రలో, ‘జై భీమ్’ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే చిత్రం రూపొందుతోంది. పాన్ ఇండియా రేంజ్లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ వచ్చింది. రజనీకాంత్ ఈ మూవీ షూటింగ్ను పూర్తి చేసుకున్నారు. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేయడంతో చిత్రయూనిట్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ వేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. యూనిట్ సభ్యులు అంతా కలిసి రజినీకాంత్కి గ్రాండ్గా వీడ్కోలు పలికారు. ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయన్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ఈ ఏడాది అక్టోబర్లో విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్, జీఎం సుందర్, రోహిణి, అభిరామి, రావు రమేష్, రమేష్ తిలక్, రక్షణ, సాబుమోన్ అబుసమద్, సుప్రీత్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూసర్: సుభాస్కరన్, రచయిత – దర్శకుడు: టీ.జే. జ్ఞానవేల్, సంగీతం: అనిరుధ్ రవిచందర్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎస్.ఆర్. కతీర్ ఐ.ఎస్.సి, ప్రొడక్షన్ డిజైనర్: కె. కధీర్, యాక్షన్ డైరెక్టర్: అన్బరివ్, ఎడిటర్: ఫిలోమిన్ రాజ్, క్రియేటివ్ డైరెక్టర్: బి కిరుతిక, ఆర్ట్ డైరెక్టర్: శక్తి వెంకట్ రాజ్.