నవతెలంగాణ – హైదరాబాద్ : హీరో విశాల్, ‘సింగం’ డైరెక్టర్ హరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘రత్నం’. గత నెల 26న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఈ నెల 23న ఓటీటీలోకి రానుంది. అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించారు.