వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు పెంపు..

నవతెలంగాణ – హైదరాబాద్: వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు 10 నుంచి 21 శాతం పెరగనున్నాయి. ఈ పెంపు జులై 4 నుంచి అమల్లోకి వస్తుందని సంస్థ ప్రకటించింది. దీంతో రూ.179 రీఛార్జ్ ప్లాన్ రూ.199కి, రూ.269 ప్లాన్ రూ.299కి పెరగనుంది. ఇలా అన్ని ప్లాన్లపై ఛార్జీల పెంపు ఉండనుంది. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ కంపెనీల టారిఫ్ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Spread the love