హిండెన్‌బర్గ్‌తో మాకు సంబంధం లేదు: కోటక్ గ్రూప్

నవతెలంగాణ – హైదరాబాద్: అదానీ గ్రూప్ షేర్ల షార్ట్ సెల్లింగ్‌లో హిండెన్‌బర్గ్‌‌కు చెందిన ఇన్వెస్టర్లకు సహకరించిందన్న ఆరోపణలను కోటక్ గ్రూప్ తోసిపుచ్చింది. హిండెన్‌బర్గ్‌తో తమ సంస్థలైన K-ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, KMILకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ‘క్లైంట్‌గా లేదా ఇన్వెస్టర్‌గా హిండెన్‌బర్గ్‌కు మా సంస్థతో సంబంధం లేదు. మా ఇన్వెస్టర్లలో ఎవరితోనైనా హిండెన్‌బర్గ్ పార్ట్‌నర్‌గా ఉందనే విషయం తెలియదు’ అని పేర్కొంది.

Spread the love