70 మందితో మొదటి లిస్ట్ ఫైనల్ చేశాం.. : కోమటిరెడ్డి

Crops are drying up...watch outనవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ నేతలు ఎంత ఏడ్చినా నల్లగొండలో గెలిచేది నేనేనని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే 70 మంది ఉన్నా సింగిల్ పేర్ల జాబితాను ఫైనల్ చేశాం. తదుపరి డబుల్ పేర్లు ఉన్న లిస్ట్‌లో పేర్లు పరిశీలించక లిస్ట్‌ను ఫైనల్ చేస్తాం. వీలైతే మొత్తం లిస్ట్ ఒకేసారి విడుదల చేస్తాం. కుదరకపోతే దసరా ముందే 16 తేదీ లోపు 70 మందితో మొదటి లిస్ట్ ప్రకటిస్తాం. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒక్కటే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికే కుట్రలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో కులాల వారీగా అందరికీ న్యాయం చేస్తాం.  ధరణితో ఒక్కో ఎమ్మెల్యే వెయ్యి కోట్లకు అవినీతికి పాల్పడ్డారు. పది గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెబుతున్న మంత్రి కేటీఆర్ నువ్వు కూడా 24 గంటలు తీగలు పట్టుకో…. ఆరు గంటలు ఇస్తే నువ్వు కూడా బతుకుతావు. అన్ని సర్వేల్లో కాంగ్రెస్ పార్టీకి 65- 75 సీట్లు వస్తాయని పలు సర్వేలు చెబుతున్నాయి. నల్లగొండలో బీఆర్ఎస్ నేతలకు జండూబామ్ ఎప్పుడో ఒకసారే పనిచేస్తాది. బీఆర్ఎస్ నేతలు జండూబామ్‌తో ఏడ్చి.. ప్రజలను ఏడిపించేలా చేశారు. ఎంత ఏడ్చినా ఏం చేసినా 40 రోజుల్లో దుకాణం బంద్ అవుతాది’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సెటైర్లు వేశారు.

Spread the love