– చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు దేశా నికే ఆదర్శమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని చన్వెల్లిలో నూతన పంచాయతీ భవ నం ప్రారంభోత్సవం, పూర్తయిన సీసీరోడ్ల శిలా ఫలకాల ప్రారంభోత్సవం, పామెనలో అండర్ గ్రౌండ్ డ్రయినేజీ, సీసీరోడ్లు, గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన, అల్లవాడలో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, పూర్తయిన సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాల ప్రారంభం, జాలాగూడలో పూర్తయిన కల్వర్టు నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ వ్యవస్థ తదితర అభివద్ధి పనులను ఎమ్మెల్యే యాదయ్య సర్పంచుల పట్లన్నగారి పద్మ, అక్నాపురం మల్లారెడ్డి, యాలాల భీంరెడ్డిలతో కలసి ఆదివారం ప్రారంభోత్సవాలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎ కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిం చేందుకు అన్ని గ్రామాలకు తారు, సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నంబర్వన్ స్థానంలో నిలిచిందని, పేదల సంక్షేమానికి కషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలిచి సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా గెలిపించాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శివప్రసాద్, ఎంపీటీసీలు మమతాభూపతిరెడ్డి, సత్యనారాయణ చారి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, బీఆర్ఎస్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు ఎదిరె రాములు, సర్పంచ్లు నరహరిరెడ్డి, మాణిక్యరెడ్డి, వెంకటేశం గుప్తా, సులోచనాఅంజన్గౌడ్, లావణ్య శంకర్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నరేందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయ కులు కష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు ప్రమోద్, నిరంజన్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అబ్దుల్ ఘని, నాలుగు గ్రామాల ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన బీజేపీ..కాంగ్రెస్ నాయకులు
పామెన గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయ కులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే బీఆర్ఎస్ కండు వాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎంపీటీసీ సత్యనారాయణ చారి, ఉపసర్పంచ్ సరళ విజ రు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్, నాయ కులు విజరు, గ్రామస్తులు పాల్గొన్నారు.