బీజేపీ.. బీఆర్ఎస్ దుబ్బాక కు చేసింది ఏమి లేదు 

– కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం
– దుబ్బాక లో ముత్యం రెడ్డి అభివృద్ధి చేసి పనులే 
– బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మాయమాటలు 
– ఒక్కసారి ఆలోచించి ఓటేయండి దుబ్బాక అభివృద్ధి చేస్తా 
– దుబ్బాక ను రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ 
నవతెలంగాణ- దుబ్బాక :  దుబ్బాక అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని, బీజేపీ, బీఆర్ఎస్ దుబ్బాక కు చేసింది ఏమి లేదని , అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఏద్దేవా చేశారు. గురువారం దుబ్బాక మండల పరిధిలోని  హాబ్సిపూర్, పద్మనాభుని పల్లి,హాసన్ మీరాపూర్, తిమ్మాపూర్ , పెద్ద గుండవెళ్లి గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ చెఱకు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అనంతరం ఆయా గ్రామాల్లోని ప్రధాన రహదారి గుండా ర్యాలీ చేసి కచేరీల వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వస్తె బంగారు తెలంగాణ చేస్తానన్న సీఎం కేసిఆర్ తాగుబోతుల తెలంగాణ చేశాడని, రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగ కల్పనలో విఫలమైంది. గత ఉప ఎన్నికల్లో కల్ల బొల్లి హామీలు ఇచ్చి యువతను దుబ్బాక ప్రజలను మోసం చేసిన రఘునందన్ రావు గెలిచాక నయ పైస పని చేయలేదని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని మరోసారి  ఆపార్టీలకు ఓటేసి మోసపోవద్దని  చెఱకు శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కేసిఆర్ అధికారంలోకి వస్తే లావని భూములు స్వాహా చేస్తుందని తాము అధికారంలోకి వస్తే ఆ భూములకు పట్టాలు ఇస్తామని అన్నారు. దుబ్బాక ఆత్మ గౌరవాన్ని సిద్దిపేటకు తాకట్టు పెట్టే కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రజా సమస్యలు గాలికివదిలేసి మూడేళ్లల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన నాయకుడి కంటే అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం పాటు పడే నాలాంటి రాజకీయ నాయకుడు కావాలో  ప్రజలంతా ఆలోచించాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ల మాయ మాటలు మరోసారి దుబ్బాక ప్రజలు నమ్మొద్దని , దుబ్బాక నియోజక వర్గంలో ఎక్కడ చూసినా చెరుకు ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి  పనులే కనిపిస్తున్నాయని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మాయ మాటలు నమ్మి మరోసారి మోస పోవద్దని అన్నారు.సిద్దిపేట తరహా దుబ్బాక అభివృద్ధితో పాటు రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇస్తున్నానని చెఱకు శ్రీనివాస్ రెడ్డి వాఖ్యానించారు. ఒక్కసారి ఆలోచించి ఓటేయండి దుబ్బాక అభివృద్ధి చేస్తా అని చెఱకు శ్రీనివాస్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మీ,మండల అధ్యక్షుడు కొంగర రవి, అక్బర్ పేట్ భూంపల్లి మండల మహిళా అధ్యక్షురాలు  సుమలత చందు, గ్రామ శాఖ అధ్యక్షులు కండ్లకొయ్య రాజేశ్, కనకయ్య, బూత్ అధ్యక్షులు కండ్లకొయ్య కర్నాకర్, రంగనబోయిన దేవ స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు
Spread the love