రఘునందన్ రావు పై బీజేపీ నేతల ఫిర్యాదు..వేటు పడనుందా..!

నవతెలంగాణ-హైదరాబాద్ : జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పుస్తెలమ్ముకొని ఎంపీగా పోటీ చేసిన బండి సంజయ్ దగ్గర 100 కోట్లు ఎక్కడివని రఘునందన్ రావు మీడియా సభ్యులతో జరిగిన చిట్ చాట్ లో పేర్కొన్నారు. అలాగే జేపినడ్డపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆయనపై ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అయితే ఈ విషయంపై తాజాగా రఘునందన్ రావు పై కొందరు బీజేపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. రఘునందన్ రావు వ్యాఖ్యల కారణంగా బీజేపీ నష్టపోయే ప్రమాదం ఉందని అధిష్టానానికి ఆధారాలతో మరి ఫిర్యాదు చేశారు. ఇక రఘునందన్ రావు పై బీజేపీ వేటు వేయనుందా..లేదా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.
బండి వద్ద రూ.100 కోట్లు ఎక్కడివి..?
[animate output image]

 

Spread the love