నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి మహిళ అదృశ్యం 

నవతెలంగాణ కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఒక మహిళ అదృశ్యమైనట్లు నిజామాబాద్ ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు ఆదివారం తెలిపారు. ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం..బాల్కొండ గ్రామానికి చెందిన సకినా,  పెంటు వయస్సు 60 సంవత్సరాలు  తన యొక్క కూతురు గర్భవతి అయినందున డెలివరీ గురించి 2-07-2024 రోజున గవర్నమెంట్ హాస్పిటల్ నందు అడ్మిట్ చేశారు. 4-07- 2024 రోజున సాయంత్రం నాలుగు గంటల సమయంలో టీ తీసుకొని వస్తానని వెళ్లి అప్పటినుండి తిరిగి గవర్నమెంట్ హాస్పిటల్ రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె గురించి అంతటా వెతికి పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. హాస్పిటల్ నుండి వెళ్లేటప్పుడు గ్రీన్ కలర్ కుర్తా పింక్ కలర్ వైట్ కలర్ చిన్ని ధరించి ఉన్నది అని తెలియజేశారు.ఈ విషయంపై కేసు నమోదు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ విజయ్ బాబు తెలిపారు
Spread the love